దారుణం..కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీ కూతురు..!

-

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాల వల్ల ప్రాణాలని తీసేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అమ్మ, నాన్నా అనేది కూడా లేక పోయింది. తాజాగా కర్ణాటక లో బెంగళూరు లోని ఒక సంఘటన చోటు చేసుకుంది. బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు ఎందుకొచ్చాయి అని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.

క్రమంగా ఈ వాగ్వాదం ముదిరి పోయింది. దీనితో కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురు చనిపోయింది. తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు రావడం వల్లే ఇలా జరిగింది. చూసిన వాళ్లంతా మార్కులు కోసం ఎందుకు ఇలా చెయ్యడం ఏమిటని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version