ఇద్దరు పిల్లలతో బావిలో దూకి త‌ల్లి ఆత్మహత్యాయత్నం

-

ఇద్ద‌రు పిల్ల‌ల‌తో బావిలో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని రోలుగుంట మండ‌లం జె. నాయుడు పాలెంలో చోటు చేసుకుంది. త‌న కుమార్తే, కుమారుడిని బావిలో తోసి అనంత‌రం తల్లి కూడా బావిలో దూకి ఆత్మ‌హ‌త్యాయత్నం చేసింది. కొద్ది స‌మ‌యం త‌ర్వాత స్థానికులు గుర్తించ‌డంతో త‌ల్లి, బిడ్డ‌ల‌ను కాపాడ‌టానికి ప్ర‌య‌త్నించారు. కానీ ఇద్ద‌రు పిల్ల‌లు అప్ప‌టికే మృతి చెందారు. స్థానికులు త‌ల్లిని మాత్ర‌మే కాపాడ‌గ‌లికారు.

కాగ మృతు ల్లో కూత‌రు భాను (5), కుమారుడు పృథ్వీ (3) గా గుర్తించారు. కాగ త‌ల్లి త‌న కుటుంబ‌తో గొడ‌వ‌ల కార‌ణంగా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో జె. నాయుడు పాలెం గ్రామంలో ఉన్న బావిలో దూకి ఆత్మ హ‌త్య య‌త్నం చేసింద‌ని తెలుస్తుంది. కాగ స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. మృతి చెందిన ఇద్ద‌రు పిల్ల‌ల మృత దేహాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version