కెసిఆర్ కు డీజీపీ మహేందర్ రెడ్డి అమ్ముడుపోయి.. చెంచాగిరి చేస్తున్నాడు ; ధర్మపురి అరవింద్

-

బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు అమ్ముడుపోయి.. ఆయనకు చెంచాగిరి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ఓ తాగుబోతు ముఖ్యమంత్రి అని… టిఆర్ఎస్ కార్యకర్తలు తాగుబోతులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అరవింద్.

ఇన్నాళ్లు ఇంట్లో పడుకున్నా కేసీఆర్… హడావిడిగా జీవో 317 తీసుకొచ్చారని మండిపడ్డారు. ఉద్యోగులతో సంప్రదింపులు ఎందుకు జరపడం లేదో టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. భార్య…పిల్లల దగ్గరకు కూడా పోనివ్వకుండా హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గులాబీ నాయకులు చేసే కార్యక్రమాలకు పోలీసులు లాఠీలకు కనిపించడం లేదా అని నిలదీశారు. బిజెపి అంటే సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు, ముగ్గురు అధికారులు మినహా… పోలీసులంతా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version