నా మీద చర్యలు తీసుకోడానికి నేను ఏ కమిటీలోనూ లేను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

తాను మాట్లాడినదాంట్లో తప్పేం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న చిన్న పిల్లలు కూడా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎలాంటి గందరగోళంలో లేనని స్పష్టం చేశారు. బీజేపీ వాళ్లే తన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

‘‘నేను ఎలాంటి గందరగోళంలో లేను. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సర్వేల ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకే కట్టుబడి ఉన్నా. వరంగల్‌ సభలో రాహుల్‌ చెప్పినట్టుగానే ఏ పార్టీతో మాకు పొత్తు ఉండదు. నేనేం తప్పుగా మాట్లాడలేదు.. ఇందులో రాద్ధాంతం ఏమీ లేదు. సెక్యులర్ భావాలున్న పార్టీలతో పొత్తు ఉంటుందని అన్నా. భాజపా వాళ్లు నా వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారు. నా మీద చర్యలు తీసుకోడానికి నేను ఏ కమిటీలోనూ లేను’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version