ఏదైన ఎంపీ మల్లన్నకే సాధ్యం!

-

మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డికి పాలాభిషేకం చేసిన అభిమానులు

ఆకట్టుకోవడానికి అరవై ఉపాయాలు అన్నట్లు.. మల్కాజ్ గిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు, విద్యాసంస్థల అధినేత మాల్లారెడ్డి ని తన అభిమానులు పాలతో అభిషేకించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీ నేతలు చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. ఇందులో భాగంగానే  పట్టుపంచె, కండువా కప్పుకొని కూర్చీ మీద కూర్చున్న మల్లారెడ్డికి ఏకంగా బకెట్ పాలతో ఆయన అభిమానులు అభిషేకం చేశారు. అనంతరం పూజారి అక్షంతలు చల్లి ఆశీర్వదించారు. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా వీరాభిమానులు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చెల్ చేస్తోంది. ‘ఏదైన మా మాల్లన్నకే సాధ్యం అంటూ’ .. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version