పొంగులేటి పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ నామా నాగేశ్వరరావు

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ 9 ఏళ్ళ కాలంలో అనేక పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. వేలాది కోట్ల రూపాయలను పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేశారని వివరించారు. తెలంగాణా రాకముందు బ్రతుకు దెరువు కోసం వలసలు ఉండేవన్నారు.

తెలంగాణ మీద కన్నుగుట్టి అభివృద్ధిని ఆపాలని కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెపుతుందని ఆరోపించారు. ఒక్క ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బిజేపి వాళ్ళు కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు నామా. ప్రజా ప్రతినిధులను అవమానపరిచేలా పొంగులేటి మాట్లాడారని అన్నారు. కేసీఆర్, కెటిఆర్ లను విమర్శించారని.. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లా నుండి గెలిచి అసెంబ్లీ గేట్ తట్టారు అని మాట్లాడుతున్నారు.. ప్రజలంటే అంత చులకనా..? అని నిలదీశారు.

ఇటువంటి పద్దతులు మార్చుకోవాలని.. ప్రజాస్వామ్యం లో ఇటువంటివి మంచివి కావన్నారు. కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. జిల్లాలో నాయకులం అందరం కలిసికట్టుగా 10 స్థానాలు గెలిపించుకుంటామన్నారు నామా. ఎంపీగా ఉన్న మీ హాయంలో ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో చెప్పాలని అన్నారు. ఏ ఎన్నికలైన ఖమ్మం ప్రజలు కేసీఅర్ కు అండగా ఉన్నారని తెలిపారు. మిమ్మల్నీ పక్కనపెట్టకే ఈ రిజల్ట్ వచ్చిందని.. కాళ్ళ మీద ఎందుకు పడ్డారో తెలియదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version