మిస్టర్ రేవంత్ రెడ్డి.. నోరు ఒళ్లు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడు : రఘునందన రావు

-

బీజేపీ నేత రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల ఎంపీగా గెలవలేదని కేవలం.. మా బీజేపీ శ్రేణుల కష్టం, అహంకారపూరిత కేసీఆర్ కుటుంబానికి, హరీశ్ రావు దుర్మార్గపు క్రియలకు మెదక్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే గెలిచానని బీజేపీ నేత రఘునందన్ రావు తెలిపారు.

బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం వల్లే తాను గెలిచానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రఘునందన్ రావు ఖండించారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..’మిస్టర్ రేవంత్ రెడ్డి.. నా గురించి కానీ నా పార్టీ గురించి మాట్లాడే ముందు నోరు ఒళ్లు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని మండిపడ్డారు. రఘునందన్ రావు జై తెలంగాణ అని నినదించినోడు, పోలీసోలతో కలబడ్డోడ్ని. నీ లాంటి వారికి భయపడే వ్యక్తిని కాదు’ అని వార్నింగ్ ఇచ్చారు. 2013లో బీఆర్ఎస్ ను వీడిన నాటి నుంచి కేసీఆర్, హరీశ్ రావుతో తాను చేస్తున్న పోరాటం మెదక్ పరిధిలోని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని తెలిపారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ, మల్కాజిగిరిలో తన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానం గెలిపించలేకపోయిన రేవంత్ రెడ్డి పొంకనాలు కొడుతున్నాడని ఎద్దేవ చేశారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని మరి ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కు బదిలీ అయ్యాయా అని బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version