సీఎం జగన్‌ కి ముద్రగడ స్వీట్ వార్నింగ్..!

-

సీఎం జగన్‌కు మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పాలకులు ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలని లేఖలో తెలిపారు. అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారని, రిజర్వేషన్ల సమస్యను కూడా తీర్చమని అభ్యర్థించారు. అసలు బీసీ రిజర్వేషన్లకు ఎందుకు ముందుకు రావట్లేదని ముద్రగడ ప్రశ్నించారు. మా జాతి సమస్య తీర్చమని ప్రధాని మోదీని కోరాలన్నారు.

నవీన్‌పట్నాయక్‌, జ్యోతిబసు, వైఎస్‌లా పూజలందుకోవాలే గానీ.. మీ పదవిని మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దని లేఖలో ముద్రగడ సూచించారు. అలాగే గతంలో కాపు రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. మీ విజయంలో మా జాతి పాత్ర ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version