ఓటీటీలోకి విశ్వక్‌సేన్‌ ‘ముఖచిత్రం’.. ఎప్పుడంటే..?

-

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే ఓరి దేవుడా సినిమాతో థియేటర్​లో సందడి చేసిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత ముఖచిత్రం అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో విశ్వక్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రధారులు.

దర్శకుడు గంగాధర్‌ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ బుధవారం ఖరారైంది. ‘ఆహా’లో ఫిబ్రవరి 3 నుంచి అందుబాటులో ఉండనుంది.

ఇక ఈ సినిమా స్టోరీకి వస్తే.. మ‌హ‌తిని (ప్రియ వ‌డ్ల‌మాని)ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకుంటాడు రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట). అత‌డు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. ఆయన్ను మాయా ఫెర్నాండెజ్ (అయేషా ఖాన్) అనే యువ‌తి చిన్న‌ప్ప‌ట్నుంచీ ప్రేమిస్తుంటుంది. త‌న ప్రియుడికి పెళ్లి కావ‌డంతో నిరాశ చెందుతుంది. అంతా సవ్యంగా సాగుతున్న ద‌శ‌లో రాజ్ జీవితంలో కొన్ని అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. అవి రాజ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అత‌ని జీవితంలో డాక్టర్ సత్య (చైతన్య రావు) ఎలా భాగమయ్యాడు? అన్నది మిగతా కథ.

Read more RELATED
Recommended to you

Exit mobile version