మంచిర్యాల జిల్లాలో ఘోరం… సొంత కోడలి గొంతు కోసి చంపిన మామ

-

కలకాలం కలిసి ఉంటానని మాటిచ్చాడు. ప్రేమించా అని పెళ్లి చేసుకున్నారు. ఏమైదో ఏమో పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ప్రియుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇదిలా ఉంటే ప్రియుడి తండ్రి చేతిలో హత్యకు గురైంది ప్రియురాలు. ఈ విషాదకరమై, ఘోరమైన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మామే తన కోడలిని అత్యంత కిరాతకంగా హతమార్చడం.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన సాయిక్రిష్ణతో అదే గ్రామానికి చెందిన సౌందర్య(19) అనే యువతితో వివాహం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సాయిక్రిష్ణ ఏమైదో ఏమో కానీ రెండు నెలలకే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త చనిపోయిన తర్వాత సౌందర్య అదే గ్రామంలో ఉంటున్న తల్లి వద్దే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈరోజు ఎవరూ ఇంట్లో లేని సమయంలో సాయిక్రిష్ణ తండ్రి తిరుపతి.. కోడలు సౌందర్య గొంతు కోసి అతి కిరాతకంగా హతమార్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version