టాలీవుడ్‌లో కరోనా కల్లోలం..మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ కు పాజిటివ్‌ !

-

టాలీవుడ్‌ పరిశ్రమను కరోనా మహమ్మారి కుదేపిస్తుంది. ఇప్పటికే ఈ కరోనా చాలా మంది సినిమా స్టార్లు పడగా… తాజాగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగానే మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ప్రకటించాడు. తనకు గత రెండు రోజుల నుంచి.. కరోనా లక్షణాలు బయటపడ్డాయని.. దీంతో… తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నానని వివరించారు.

ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ వివరించారు. ప్రస్తుతం తాను.. హోం ఐసోలేషన్‌ లో ఉన్నట్లు తెలిపారు థమన్‌. ఇక ఈ మధ్య కాలంలో…. తనను కలిసిన వారంతా.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశాడు థమన్‌. కాగా.. టాలీవుడ్‌ పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా భారీన పడ్డారు. ప్రిన్స్‌ మహేష్‌ బాబు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, విశ్వక్‌ సేన్, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ లాంటి నటులకు కరోనా సోకింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version