5.18లక్షల ఓట్ల ఆధిక్యంలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి

-

గత అసెంబ్లీ ఎన్నికలలో భారీ స్థాయిలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో అదే ఫలితాన్ని రిపీట్ చేస్తుంది.భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుంది.నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రికార్డు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా చివరి దశ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా…. ప్రస్తుతం 5.18 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో అత్యధిక మెజార్టీ సాధించే అభ్యర్థిగా కిరణ్ రికార్డు నెలకొల్పనున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాలలో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు బిజెపికి కూడా ఎనిమిది స్థానాలలో ఆధిక్యంలో నిలిచింది. టిఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు ఖాతా తెరవలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version