దట్ ఈజ్ బాలయ్య.. కోవిడ్ సెంటర్‌కు భారీ విరాళం..!

-

టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా నేపథ్యంలో ఛారిటీ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. తాజాగా తన నియోజక వర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ కోసం రూ.55 లక్షల విరాళం ప్రకటించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు ఇంకా ఇతర వైద్య పరికరాల నిమిత్తం ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. అలాగే కరోనా విరాళంగా గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి బాలకృష్ణ కోటి రూపాయలు విరాళంగా అందించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా సీసీసీకి కూడా తన వంతు విరాళం ప్రకటించాడు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటుగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ  సినిమా టైటిల్‌‌ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version