చూస్తుంటే దళితులపై దమనకాండ అంతా జగన్ కనుసన్నల్లోనే : లోకేశ్‌

-

ఇటీవల తన మాజీ డ్రైవర్‌ హత్యకేసులో జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను అతికిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబును హీరోగా కీర్తిస్తూ దేవీపట్నటం మండలం ఇందుకూరుపేటలో వైసీపీ ఊరేగింపు నిర్వహించిందని నారా లోకేశ్ మండిపడ్డారు. దళిత యువకుడ్ని చంపిన అనంతబాబుకు జగన్ పాలాభిషేకం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేశ్.

జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీలతో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై దమనకాండ అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు స్పష్టమవుతోందని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వంలో నిందితులకు రక్ష, బాధితులకే శిక్షేనని మరోసారి రుజువైందని పేర్కొన్నారు నారా లోకేశ్. దళితులను దారుణంగా చంపేవాళ్లకు ప్రమోషన్లే తప్ప, సస్పెన్షన్లు ఉండవని జగన్ లీడర్ల నుంచి క్యాడర్ వరకు భరోసా ఇస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version