గన్ కంటే ముందు జగన్ వచ్చి మహిళలను కాపాడాలి – నారా లోకేష్

-

కాకినాడలో యువతిని నడిరోడ్డుపై నరికేసిన సంఘటనపై నారా లోకేష్‌ స్పందించారు. మహిళల ప్రాణాల విషయంలో అయినా సీఎం జగన్ నిజాలు మాట్లాడితే గౌరవంగా ఉంటుందని… రాష్ట్రంలో దిశా చట్టం ఉందా? లేని ఆ చట్టం పేరుతో ఎందుకు ఇంకా ప్రజల్ని మోసం చేస్తున్నారు సీఎం గారూ? అని నిలదీశారు.

నేరాలపై మీ తూతూ మంత్ర ప్రకటనలతో బాధిత కుటుంబాలకు ఎలాంటి సాంత్వన చేకూరదని ప్రశ్నించారు. మాయ మాటలు, కపట ప్రకటనలు కట్టి పెట్టి కాకినాడలో యువతిని నడిరోడ్డుపై నరికేసిన ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మీ మిగిలిన పాలనలోనైనా ఒక్కసారైనా..గన్ కంటే ముందు జగన్ వచ్చి ఒక్క మహిళ ప్రాణమైనా కాపాడితే మిమ్మల్ని అభినందించాలి అని ఎదురు చూస్తున్నానన్నారు. జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరింది. మహనీయులను అవమానించి రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version