తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? : నారా లోకేష్

-

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మరియు ఆయన ప్రభుత్వ తీరు పై నిప్పులు చెరిగారు తెలుగు దేశం నాయకులు నారా లోకేష్‌. తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేసారంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదిక గా ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

”తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేసారు. దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలన్ని ఏపీ వైపు వేలు చూపిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తుంటే డీజీపీ గారు మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారు. డ్రగ్స్ డాన్ ని కాపాడేందుకు ప్రయత్నాలు ఆపి ఏపీ పరువు కాపాడేందుకు శ్రద్ధ చూపాలి.” అంటూ నారా లోకేష్‌ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల విజయ వాడ లో భారీ స్థాయి లో డ్రగ్స్‌ పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version