అన్ని విప్పి చూపిస్తే పద్మశ్రీ ఇస్తారా..? కంగానాపై నారాయణ సెటైర్లు

-

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కంగనాపై మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు. కంగనా రౌనత్ విలాసవంతమైన భిక్షగత్తె అని.. రైతులకు అండగా నిలబడితే సోనూసూద్ పై కేసులు, విప్పి చూపించే కంగనా రనౌత్ కు పద్మశ్రీనా..? అని నిప్పులు చెరిగారు. ఎపిలో పోలీసు-రౌడీ వ్యవస్థ కలిసిపోయిందని.. ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలకు సిఎం ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. పిఆర్ సిని – పే రివర్స్ కమిషన్ గా వైసిపి మార్చిందని.. బిజెపి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే సిఎం ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహించారు.

జనవరి 26నుంచి సిపిఐ జాతీయ సమావేశాలు నిర్వహిస్తాని.. చెప్పులను వేసుకోవడం కాదు తలపై పెట్టుకునే దుస్థితికి బిజెపి తీసుకొచ్చిందని ఫైర్ అయ్యారు. చెప్పులపై జిఎస్టీ వేయడమేంటి..? జిఎస్టీతో దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విజయవాడలో పరువు పోగొట్టి గుంటూరులో జిన్నా టవర్ వద్ద వీర్రాజు తన పరువు వెతుక్కుంటున్నాడని.. సోము వీర్రాజు కు సారాయి వీర్రాజు అన్న పేరు సార్థకం అవుతుందని చురకలు అంటించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం బిజెపి చేస్తోందని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version