ఏపీకి ఆ మందులు ఫ్రీగా ఇచ్చేస్తాం…!

-

కోవిడ్‌ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరపున ఉచితంగా అందిస్తామని సీఎం వైయస్‌.జగన్‌కు నాట్కో ఫార్మా లిమిటెడ్‌ లేఖ రాసింది. కోవిడ్‌ –19 చికిత్సలో వాడే బారిసిటినిబ్‌–4 ఎంజీ (బారినట్‌) టాబ్లెట్స్‌ ఉచితంగా ఇవ్వనున్నట్టు లేఖలో నాట్కో ట్రస్టు పేర్కొంది. సుమారు లక్ష మంది కోవిడ్‌ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేయనున్నట్టు నాట్కో ఫార్మా లిమిటెడ్‌ తెలిపింది.

రూ.4 కోట్ల 20 లక్షలు మార్కెట్‌ ఖరీదు చేసే టాబ్లెట్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సంస్ధల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు ఇవ్వనున్నట్టు నాట్కో ట్రస్టు స్పష్టం చేసింది. విడతల వారీగా రానున్న కొద్ది వారాల్లో ఈ మెడిసిన్‌ సరఫరా చేయనున్నట్టు నాట్కో ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ వి సి నన్నపనేని స్పష్టం చేసారు. మందుల కొరత కాస్త తీరే అవకాశం ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version