పుణెలో దారుణం.. చిరుత దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

-

మ‌హారాష్ట్ర పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.  ఓ పులి నాలుగేండ్ల బాలుడిని దాడి చేసి చంపింది. ఈ ఘ‌ట‌న‌ను అట‌వీ శాఖ అధికారులు ధృవీక‌రించారు. జున్నార్ ఏరియాలోని అలే గ్రామ స‌మీపంలోని వ్య‌వ‌సాయ పొలంలో శివాన్ష్ భుజ్బాల్(4) అనే పిల్లాడు.. త‌న తాత‌తో క‌లిసి ఉన్నాడు. తాత వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకుంటున్న స‌మ‌యంలో పులి అక్క‌డ‌కు వ‌చ్చింది. ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన చిరుత‌.. అత‌న్ని ప‌క్క‌నే ఉన్న చెరుకు తోట‌లోకి లాక్కెళ్లింది.

పిల్లాడి అరుపులు విన్న రైతులు అక్క‌డికి ప‌రుగెత్తుకొచ్చారు. చిరుత నుంచి బాలుడిని త‌ప్పించేందుకు రైతులు తీవ్రంగా య‌త్నించారు. చెరుకు తోట‌లో బాలుడిని వ‌దిలేసి పారిపోయింది పులి. బాలుడి ముఖం, మెడ‌, త‌ల‌పై తీవ్ర గాయాల‌వ‌డంతో, చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శివాన్ష్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version