80 ఏళ్లొచ్చినా కొందరు రిటైర్ కారు.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

-

 మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌ లక్ష్యంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 80 ఏళ్లు పైబడినా కొంతమంది పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా లేరని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.  సాధారణంగా చాలా మంది ఇతర ఉద్యోగులు 75 ఏళ్ల వయసులో వృత్తిపరమైన జీవితం నుంచి వైదొలుగుతారు కానీ కొంతమంది 80 దాటి 84 ఏళ్లు (శరద్ వార్ వయసును ఉద్దేశిస్తూ) వచ్చినా రిటైర్ అయ్యేందుకు సిద్ధంగా లేరని పరోక్ష విమర్శలు చేశారు. పని చేయడానికి తామున్నాం కదా.. ఏదైనా తప్పు ఉంటే తమకు చెప్పొచ్చు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకుముందు తాను ఉప ముఖ్యమంత్రిగా పనిచేశానని అనేక పథకాలు విజయవంతం చేశానని అన్నారు.

ఠాణెలో నిర్వహించిన ఎన్​సీపీ సమావేశంలో మాట్లాడిన అజిత్ పవార్ ఎన్​సీపీని చీల్చి బీజేపీ-శివసేన సర్కారుతో చేతులు కలపడాన్ని సమర్థించుకున్నారు. తన నిర్ణయానికి కారణాలను చెబుతూ.. ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలు పరిష్కరించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసినట్లు పవార్ స్పష్టం చేశారు. అధికారం లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యం కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version