అమర్​నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

-

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డాణాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి-నాగ్​పుర్ హైవేపై ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు ట్రావెల్ బస్సులు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జయ్యాయి.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రెండు బస్సుల్లో ఓ బస్సు అమర్​నాథ్ యాత్రికులతో వెళ్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండటం వలనో లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version