ఎయిరిండియా విమానంలో మరో షాకింగ్‌ ఘటన.. ఈసారి దుప్పటిపై..?

-

ఎయిరిండియా విమానంలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన ప్రయాణికుడిని పట్టుకొనేందుకు పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డిసెంబర్‌ 6న పారిస్‌-దిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఏ తరగతిలో ఈ దుశ్చర్య జరిగిందన్న విషయం మాత్రం తెలియలేదు.

డిసెంబరు 6న ఉదయం 9:40 గంటలకు విమానం దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. మద్యం మత్తులో ఉన్న నిందితుడు క్యాబిన్‌ సిబ్బంది సూచనల్ని పట్టించుకోలేదని, అంతేకాకుండా ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోసినట్టు భద్రతా సిబ్బందికి సమాచారం అందింది. దీంతో అతడు విమానం దిగగానే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆ ప్రయాణికులిద్దరి మధ్య రాజీ కుదరడం, నిందితుడు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో విడిచిపెట్టినట్టు తెలిపారు. తొలుత రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన మహిళ.. పోలీసు కేసు పెట్టేందుకు నిరాకరించడంతో ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఫార్మాలటీలను పూర్తి చేసి నిందితుడిని వదిలేసినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version