నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్‌.. బెంగళూరు హౌసింగ్‌ సొసైటీ నిర్ణయం

-

వేసవిలో నీటి కష్టాలను ముందే అరికట్టేందుకు బెంగళూరులో ఓ హౌసింగ్ సొసైటీ అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నందున నీటి వృథాను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో నివసించే వారిలో ఎవరైనా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు పేర్కొంది.

గత నాలుగు రోజులుగా బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్‌ బోర్డు నుంచి నీరు రావడం లేదని, ప్రస్తుతం బోర్ల ద్వారా నీరు అందిస్తున్నామని హౌసింగ్ సొసైటీ గృహ సముదాయాల్లోని వారికి నోటీసులు జారీ చేసింది. సొసైటీలో నివసించేవారు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని కోరుతున్నామని పేర్కొంది. దీనివల్ల వేసవిలో ఎక్కువ రోజులు నీరు వినియోగించుకోవచ్చని, ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే.. వారికి రూ. 5వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించిం ది. ప్రత్యేకంగా నియమించిన భద్రతా సిబ్బంది నీటి వినియోగాన్ని పర్యవేక్షిస్తారని వైట్‌ఫీల్డ్‌లోని పామ్‌ మిడోస్‌ హౌసింగ్ సొసైటీ గృహసముదాయాల్లోని వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version