అగ్నిపథ్‌పై నేడు భారత్ బంద్.. రైల్వేస్ హై అలర్ట్..!

-

దేశ వ్యాప్తంగా అగ్నిప‌థ్ పేరిట నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతూ ఉన్నాయి. ఆర్మీలో చేప‌ట్టాల‌నుకుంటున్న పార్ట్ టైం రిక్రూట్మెంట్ వ‌ద్దే వ‌ద్ద‌ని అంటున్నారు యువ‌త. అసలు ఇప్ప‌టిదాకా చేపట్టిన ర్యాలీల సంగ‌తి ఏంటి వాటికి రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించేది ఎప్పుడు అని నిల‌దీస్తున్నారు.

ఇప్ప‌టిదాకా నిర్వ‌హించిన ఆర్మీ ర్యాలీల‌కు సంబంధించి ఫిజిక‌ల్ టె స్టులు పూర్త‌య్యాక, రాత ప‌రీక్ష‌ల కోసం సిద్ధం అవుతున్న వారికి ప్ర‌భుత్వం ఇచ్చే సమాధానం ఏంట‌న్న‌ది వారి ఆవేద‌న. అయితే.. ఈ అగ్ని పథ్‌ పథకానికి వ్యతిరేకంగా… తాజాగా భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చారు ఆందోళన కారులు.

అటు ఈ బంద్‌ కు దేశంలోని ప్రతి పక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. అయితే.. ఈ బంద్‌ ను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్‌ బంద్‌ ను నీరు గార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో.. ఇతర కేంద్రప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను పెంచేసింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version