కాశ్మీర్‌కు రైలు… 132 ఏళ్ల కల.. మోడీ చేతుల మీదుగా నేడు చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ ప్రారంభం..

-

జమ్ము కాశ్మీర్ ప్రజలకు మోడీ ప్రభుత్వం శుభవార్త అందజేశారు. జమ్మూ కాశ్మీర్ లోని ప్రజల కొన్ని సంవత్సరాల కలను మోది నిజం చేశారు. ఇవాళ జమ్ము కాశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (359 మీటర్ల) చీనాబ్ రైల్వే వంతెనను ఇవాళ ప్రారంభిస్తారు. 272 కిలోమీటర్ల పొడవైన ఉదంపూర్ – శ్రీనగర్ – బారముల్లా రైల్వే లింక్ లో భాగంగా ఈ వంతెనను నిర్మించారు.

PM Modi To Inaugurate World's Highest Chenab Bridge
PM Modi To Inaugurate World’s Highest Chenab Bridge

ఈ వంతెన ద్వారా ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానం కానుంది. అలాగే కాత్రా – శ్రీనగర్ వందే భారత్ రైలును కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. చీనాబ్ వంతెన ఇవాళ ఉదయం ప్రారంభం కానుంది. ఈ వంతెన వల్ల జమ్మూ కాశ్మీర్ లోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల వారి కలను సాకారం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news