ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది.. పలువురు లాయర్లపై సీజేఐ ఆగ్రహం

-

పలువురు సుప్రీంకోర్టు లాయర్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టులు, జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. లాయర్లు ఒకరోజు సీజేఐ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందని.. ఒక్కసారి ఆ స్థానంలో కూర్చొని భరిస్తే తెలుస్తుందని ధ్వజమెత్తారు. ఒక్కరోజు కూర్చుంటే.. మళ్లీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారని పేర్కొన్నారు.

ముంబయి చెంబుర్‌ కాలేజ్‌లో బురఖా, హిజాబ్‌ రద్దు వ్యవహారంపై విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారని.. జడ్జిలపై ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని వాపోయారు. ప్రతి ఒక్క పిటిషన్‌పై విచారణ చేస్తామన్న ఆయన.. దానికి ఒక తేదీ ఇస్తామని.. అంతేగానీ జడ్జిలను, కోర్టును శాసించవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఇటీవలే ‘స్వరం పెంచొద్దు. నన్ను బెదిరించొద్దు. ఈ కోర్టు నుంచి బయటకు వెళ్లిపోండి’ అంటూ ఓ సీనియర్ న్యాయవాదిపై సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేసులో లాయర్ల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version