దిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్

-

బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు, ఇతర అధికారులు ఉన్నారు. దిల్లీలో ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేసీఆర్ పాల్గొననున్నారు.

దిల్లీ వసంత్‌ విహార్‌లో పార్టీ కార్యాలయం నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని మధ్యాహ్నం 1.05 గంటకు కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒకటిన్నర వరకు ఆయన అక్కడే ఉంటారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు దిల్లీకి బయలుదేరారు.

వసంత్ విహార్​లో 1500 గజాల స్థలంలో నిర్మించిన 3 అంతస్తుల పార్టీ కార్యాలయానికి ఇవాళ వాస్తు పూజ నిర్వహించనున్నారు. సుదర్శన హోమం అనంతరం పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. 20 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ కార్యాలయంలో లోయర్‌గ్రౌండ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మూడుఅంతస్తుల్లో కార్యాలయాలు, కాన్ఫరెన్స్‌ హాళ్లు, అతిధుల గదులు నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version