ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

-

ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంకయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.” మీ హుందాతనం, సమాజం, దేశం పట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తూ.. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను” అని సీఎం కేసీఆర్ తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉపరాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదనానికి నిండైన రూపంగా భాసిల్లుతూ.. ఏ స్థాయిలో ఉన్నా తెలుగు వారి శ్రేయస్సుకు, తెలుగు భాష అభివృద్ధికి వెంకయ్యనాయుడు కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెంకయ్య కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిస్వార్ధంగా, నిబద్ధతతో దేశానికి ఉపరాష్ట్రపతి సేవలు అందిస్తున్నారని, ఆయన సేవలు దేశానికి అవసరమని ట్విట్టర్ ద్వారా కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version