ఆసియా క్రీడలు 2023 : ఆర్చరీలో ఇండియాకు గోల్డ్, సిల్వర్ ఖరారు

-

భారత ఆర్చర్లు అదరగొట్టారు. చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, ఓజస్ డియోటలే ఫైనల్ చేరారు. వీరిద్దరూ ఫైనల్ లో తలపడనున్నారు. దీంతో ఒక గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ ఇండియా ఖాతాలో చేరనున్నాయి. మరోవైపు హాకీలోను మహిళల జట్టు సెమీస్ చేరింది. ఇది ఇలా ఉండగా ఆసియా క్రీడలు 2023 పురుషుల క్రికెట్‌లో సెమీస్‌కు భారత్ చేరింది.

Gold, Silver for India in Archery

ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన టి20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. తోలుత బ్యాటింగ్ చేసిన ఋతురాజ్ సేన… ప్రత్యర్థి ముందు 203 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చేదనకు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 రన్స్ మాత్రమే చేసింది. చివరి బంతి వరకు జరిగిన ఈ ఉత్కంఠ పోరులో 23 రన్స్ తేడాతో గెలిచిన భారత్… సెమీస్ కి చేరింది. దీంతో ఆసియా క్రీడలు 2023 పురుషుల క్రికెట్‌లో సెమీస్‌కు చేరిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version