గుజరాత్లో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 14మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి

-

గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వడోదరాలోని హర్ణి మోట్నాథ్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టారు. ప్రమాద సమయంలో పడవలో 27 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఏబీ గోర్ తెలిపారు. వీరంతా విహారయాత్ర కోసం వెళ్లినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు 10 మంది విద్యార్థులను కాపాడినట్లు ఫైర్ ఆఫీసర్ చీఫ్ పార్థ్ బ్రహ్మ్భట్ తెలిపారు. తాము ఘటనాస్థలికి చేరేకన్నా ముందే కొందరు స్థానికులు విద్యార్థులను కాపాడినట్లు వెల్లడించారు. విహారయాత్రలో భాగంగా బోటింగ్ కోసం వచ్చిన 27 మందిలో 23 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం.

‘బోటులో ప్రయాణిస్తున్న 23 మంది విద్యార్థుల్లో కేవలం 11 మంది మాత్రమే లైఫ్ జాకెట్లను ధరించారు. మిగతావారంతా ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా 10 మందిని రక్షించగలిగాం. వీరిలో కూడా ఒక విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. మరొక విద్యార్థిని ఎస్ఎస్జీ ఆస్పత్రికి తరలించాము’ అని ఫైర్ చీఫ్ ఆఫీసర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version