రాహుల్‌ గాంధీపై పరువునష్టం కేసు.. నేడే గుజరాత్‌ హైకోర్టు తీర్పు

-

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్ ఏంటో ఇవాళ తేలనుంది. మోదీ ఇంటిపేరు కేసులో గుజరాత్ హైకోర్టు ఇవాళ కీలక తీర్పునివ్వనుంది. పరువు నష్టం కేసులో రెండేండ్లు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టుఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో కోర్టు స్టే విధించినట్లయితే రాహుల్‌ అనర్హత రద్దయ్యే అవకాశం ఉంది. సూరత్‌ కోర్టు విధించిన రెండేండ్ల శిక్షను న్యాయస్థానం సమర్థించినట్లయితే.. ఆరేళ్లపాటు రాజకీయాలకు రాహుల్‌ అనర్హులవుతారు.

 

2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ .. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోదీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తంచేసిన గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ.. సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావావేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version