అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం.. యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తాం !

-

అయోధ్య రామ మందిరం ఈనెల 22వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో సంచలన ప్రకటన తెరపైకి వచ్చింది. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతున్న ఖలిస్థానీ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ హెచ్చరిక సందేశం పంపాడు.

Gurpatwant Singh Pannun

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని హెచ్చరించాడు. ముగ్గురు కలిస్తానే ఉగ్రవాదులను యూపీ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవలే… పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను కూడా హత్య చేస్తానని ఓ వీడియో విడుదల చేశాడు ఖలిస్థానీ గురుపత్వంత్ సింగ్ పన్నున్‌.

కాగా, అయోధ్యలో ఈనెల 22వ తేదీన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. నిన్న బాలరాముడి ఫోటోలు బయటకు రాగా… తాజాగా పూల అలంకరణలు మరియు ఆభరణాలతో కూడిన రామ్ లల్ల విగ్రహం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version