ఇండియా కూటమి సమావేశాలు కామెడీ షోలను తలపిస్తున్నాయి – ఖుష్బూ

-

ఇండియా కూటమి సమావేశాలు కామెడీ షోలను తలపిస్తున్నాయని విమర్శించారు బిజెపి జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు కుష్బూ. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షాల కూటమిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారు అంటూ పదేపదే చెబుతున్న స్టాలిన్ ఆ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిని ప్రకటించేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

మోదీని ఓడించేందుకు 26 పార్టీల నాయకులు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది మోదీని ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని తెలిపారు. గత లోక్సభ ఎన్నికలలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ధైర్యంగా ప్రకటించిన స్టాలిన్ ఈసారి ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో తెలియక అయామయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version