టీమిండియాను ఎక్కడైనా ఓడిస్తాం : పాక్ మాజీ ప్లేయర్

-

టీమిండియాను ఎక్కడైనా ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్ మాజీ ప్లేయర్ వకార్ యూనిస్. ఆసియాకప్ లో భాగంగా శ్రీలంకలో, డబ్ల్యూసిలో భాగంగా అహ్మదాబాద్ లో టీమిండియాపై పాకిస్తాన్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో పాక్ మాజీ పెసర్ వకార్ యూనిస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘టీమిండియాను ఓవల్ లో ఓడించాం. కాబట్టి ఎక్కడైనా ఓడిస్తాం. ఎక్కడ ఆడుతున్నామనేది ముఖ్యం కాదు’ అని వాక్యానించారు. కాగా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానంలో టీమిండియాపై పాకిస్తాన్ 180 రన్స్ తేడాతో గెలిచింది. కాగా, ఇటీవల కాలంలోనే ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా కప్‌ లో భాగంగా… టీమిండియా మరియు పాకిస్థాన్‌ జట్ల మధ్య శ్రీలంకలో మొదటి మ్యాచ్‌ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version