కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ తరువాత ఇండియాకి లాలు.. కూతురు ఎమోషనల్ ట్వీట్

-

బీహార్ మాజీ సీఎం, ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి కిడ్నీ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ కు ఆయన కుమార్తె రోహిని ఆచార్య కిడ్నీ దానం చేశారు. అయితే ఆపరేషన్ తర్వాత నేడు సిగ్గాపూర్ నుంచి లాలు భారత్ కి రానున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ట్వీట్ చేశారు. లాలూ ఆరోగ్యం పై వరుస ట్వీట్లు చేసిన రోహిణి తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు వెల్లడించారు.

ఆపరేషన్ తర్వాత లాలూకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారని.. అందువల్ల తన తండ్రి ఎలాంటి ఇన్ఫెక్షన్ భరిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆమె తెలియజేశారు. తన తండ్రిని ఎవరైనా కలిసి నప్పుడు మాస్కు కూడా ధరించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version