ఇండియన్ ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది

-

భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ మనోజ్‌ సి.పాండే ఈనెల 30తో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్‌ వైస్‌ చీఫ్‌గా ఉన్నారు.

1964లో జన్మించిన ద్వివేది 1984లోరేవా సైనిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించిన ఆయన.. నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ, యూఎస్‌ ఆర్మీ వార్‌ కళాశాలలో చదువుకున్నారు. డిఫెన్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ చేశారు. ఆ తర్వాత జమ్ముకశ్మీర్‌ రైఫిల్స్‌లో చేరి ఇప్పటి వరకు 40 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్నారు. ఆర్మీలో పలు కీలక పాత్రలు పోషించిన ఆయన కశ్మీర్‌ వ్యాలీ, రాజస్థాన్‌ సెక్టార్‌లో సెక్టార్‌ కమాండర్‌, అస్సాం రైఫిల్స్‌ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో డైరెక్టర్‌ జనరల్‌ ఇన్‌ఫాంట్రీ, నార్తర్న్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version