మహారాష్ట్రకు త్వరలోనే మరో కొత్త సీఎం – సంజయ్ రౌత్

-

అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసని.. గతంలో ఏక్నాథ్ షిండే తో పాటు ఆయనకు మద్దతు ఇస్తూ వెళ్లిన 16 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే అనర్హులుగా మారతారని అన్నారు. మహారాష్ట్రకు త్వరలోనే మరో కొత్త ముఖ్యమంత్రి వస్తారని జోష్యం చెప్పారు. ఇక మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల వెనుక చైనా హస్తం ఉందని ఆరోపించారు సంజయ్ రౌత్.

ఈ విషయానికి సంబంధించి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్ లో బిజెపి అధికారంలో ఉందని.. అలాంటి ప్రాంతంలో హింసను ఎవరు ప్రేరేపించారని నిలదీశారు. ఈ అల్లర్లపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. మణిపూర్ లో అల్లర్లు మొదలై 40 రోజులు అయినప్పటికీ ఇంకా హింస కొనసాగుతూనే ఉందని.. అక్కడి ప్రజలు తమ సొంత నివాసాలను వదిలి వెళ్ళిపోయి పునరావాస కేంద్రాలలో తల దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version