Manipur Violence : మొత్తం నలుగురు నిందితులు అరెస్ట్

-

 

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ అంశంపై స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు.

అయితే..ఈ మణిపూర్ ఘటనలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది. దీంతో మొత్తం నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇక ఈ ఘటనకు కారకులైన వారికి మరణ శిక్ష విధించాలని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని చెప్పారు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్. మహిళలు, ఆడపడుచులు, పెద్దలకు వ్యతిరేకంగా ఇదే ఆఖరి నేరం కావాలని విజ్ఞప్తిచేసిన చెప్పిన మణిపూర్ ముఖ్యమంత్రి. మన మాతృమూర్తులు, ఆడపడుచులను, పెద్దలను మనం గౌరవించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version