చక్కెర రైతులకు తీపి కబురు చెప్పిన నిర్మల సీతారామన్.. !

-

చక్కర రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. మొలాసిస్ పై పన్నులను 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య వల్ల చెరుకు రైతులకు మేలు జరుగుతుంది. పశువుల దాణా ధర కూడా తగ్గుతుందని నిర్మల సీతారామన్ వెల్లడించారు. మనుషులు వినియోగించే మద్యాన్ని కూడా లెవి నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

70 శాతం తృణధాన్యాలు ఉన్న పిండిపై గణనీయంగా తగ్గించారు. పిండిని వదులుగా అమ్మితే సున్నా శాతం పన్ను ఉంటుందని, ముందుగా ప్యాక్ చేసి లేబుల్ చేసి విక్రయిస్తే.. 5 శాతం పన్ను ఉంటుందని సీతారామన్ ప్రకటించారు. 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. మొలాసిస్ పై జీఎస్టీ తగ్గించడం వల్ల మిల్లర్ల వద్ద ఎక్కువ డబ్బు ఉంటుందని చెరుకు రైతుల బకాయిలను వేగంగా క్లియరెన్స్ చేయవచ్చని ఆమె అన్నారు. ఈ నిర్ణయం పశువుల దాణా ఖర్చులను తగ్గించేందుకు కారణం అవుతుందని ఆమె అన్నారు. 

ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈఎన్ఏపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలు కోల్పోయాని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. రాష్ట్రాలు పన్నులు విధించాలనుకుంటే దానిని స్వాగతిస్తామని అన్నారు. పన్ను విధించే హక్కు జీఎస్టీ కౌన్సిల్ కి ఉన్నప్పటికీ పన్నులు విధించడం లేదని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version