డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాం : డీ.కే.శివకుమార్

-

డీలిమిటేషన్ పేరుతో లోక్ సభలో సౌత్ ఇండియా ప్రాతినిధ్యం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దీనిని వ్యతిరేకిస్తుందని తెలిపారు. దక్షిణ భారతంలో ఏ రాష్ట్రం సీట్లు తగ్గినా ఊరుకునేది లేదని, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ తో పాటు కోర్టులో కూడా పోరాడుతామన్నారు.

మరోవైపు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మా పార్టీ మంత్రులే తెలిపారు. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదన్నారు. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం పై వస్తున్న విమర్శలపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version