నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. ఇవాళ ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ తరుణంలోనే కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మోహరించారు.
కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంది.
ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. గుంటూరు ఏసీ కాలేజీలో కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఉంటుంది. గత నెల 27న నిర్వహించిన ఎన్నికల.. ఫలితాలు ఇవాళ వచ్చే ఛాన్సు ఉంది.