Vande Bharat: నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ

-

PM Modi to flag off 3 new Vande Bharat Express trains today: దేశ ప్రజలకు బిగ్‌ అలర్ట్. మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది మోడీ సర్కార్‌. ఈ మేరకు దక్షిణ రైల్వే జోన్‌లో మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అంటే ఇవాళ ఉదయం జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

PM Modi to flag off 3 new Vande Bharat Express trains today

మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి.తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్ మరియు నాగర్‌కోయిల్, మదురై మరియు బెంగళూరు కంటోన్మెంట్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మరియు లక్నో మధ్య కొత్త రైళ్లు నడుస్తాయి. దీనికి సంబంధించిన ఉత్సవ కార్యక్రమాలు డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మరియు దక్షిణ రైల్వే జోన్‌లోని మధురై జంక్షన్‌లో జరుగుతాయి. మరో రెండు కొత్త సర్వీసులు సెప్టెంబరు 2 నుంచి ప్రారంభం కానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version