అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్‌కు ఆహ్వానం

-

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు తరలి రానున్న ప్రముఖులు, అతిథులు, భక్తుల కోసం వసతుల కల్పనపై దృష్టి సారించింది. మరోవైపు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపుతోంది.

ఇప్పటికే ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ప్రముఖ నాయకులకు, వ్యాపార ప్రముఖులకు, సుప్రసిద్ధ వేద పండితులకు ఆహ్వానాలు అందించింది. ఈ క్రమంలోనే పలువురు సినీ నటులు కూడా అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్నారు. వారిలో టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సన్నీ దేవోల్‌, యశ్‌ సహా బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు నిర్మాత మహావీర్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version