యూట్యూబర్ జ్యోతితో సహ 11 మంది ఊహించని షాక్ తగిలింది. యూట్యూబర్ జ్యోతితో సహ 11 మందిపై దేశ ద్రోహం కేసు నమోదు అయింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలుపెడితే.. ఇప్పటి వరకు పాక్ కోసం పని చేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారుల వివరాలు బయటపెట్టింది నిఘా వర్గాలే కావడం గమనార్హం.

వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం.. జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసర్. 33 ఏళ్ళ జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తో పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పని చేయటం మొదలెట్టింది. ఆమెతో పాటూ మాతో 11 మంది ఉన్నారు.