రాజకీయాలకు షేఖ్ హసీనా గుడ్ బై…?

-

Sheikh Hasina good bye to politics: బంగ్లాదేశ్‌ పరిస్థితుల నేపథ్యంలో షేఖ్ హసీనా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయాలకు షేఖ్ హసీనా గుడ్ బై చెప్పిందని అంటున్నారు.

Sheikh Hasina good bye to politics

గత జనవరి లో ఐదవ సారి ప్రధాని గా పదవీ భాద్యతలు చేపట్టిన షే ఖ్ హసీనా “తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో ఉండ బోరు”, అని ఆమె కుమారుడు ప్రకటన చేయడం జరిగింది. అమె రికా లో ఉంటున్న ఆమె కుమారుడు, మాజీ ప్రధాన సలహాదారు సజీబ్ వాజెద్ జాయ్…ఈ విషయాన్ని “ బిబిసి” లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ప్రకటించారు.

కాగా బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఢాకా వీధుల్లో లక్షల సంఖ్యలో యువత నిరసనలు చేస్తున్నారు. దీంతో ఘర్షణలు, హింస చెలరేగాయి. “ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్”, “బంగాబంధు మ్యూజియమ్” లను ధ్వంసం చేశారు నిరసనకారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version