ఇరాన్ పై దాడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెహ్రాన్ కు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన ట్రంప్..తానేం చేస్తానో ఎవరికీ తెలియదని వెల్లడించారు ప్రెసిడెంట్ ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అతి త్వరలోనే ఇరాన్ పై అమెరికా దాడులు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక అటు ‘ఆపరేషన్ సింధు’ మొదలైంది..అని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేశారు. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనికి ‘ఆపరేషన్ సింధు’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు కేంద్ర విదేశాంగ శాఖ. టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఉత్తర ఇరాన్ నుంచి జూన్ 17న ఆర్మేనియాకు చేరుకున్న 110 మంది విద్యార్థులను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసారు. వీరంతా జూన్ 19న ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నట్లు తెలిపారు కేంద్ర విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైశ్వాల్.