ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విరాట్ కోహ్లీ సోదరి

-

విరాట్ కోహ్లీ సోదరి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన డబ్ల్యూసి మ్యాచులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ సెంచరీపై ఆయన సోదరి భావన కోహ్లీ దింగ్రా ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నువ్వు సెంచరీలు చేయడానికి పుట్టావేమో అనిపిస్తోంది. నీ హార్డ్ వర్క్, ఆట పట్ల నీకున్న ఫ్యాషన్….నీ ప్రతి అడుగులో కనిపిస్తుంది.

Virat Kohli’s sister reacts to his epic century in World Cup, says ‘as a family we could not be more fortunate

కుటుంబ సభ్యులుగా నీ విజయాన్ని ఆస్వాదించడం మా అదృష్టం. గాడ్ బ్లెస్ యు’ అని భావన తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఏకంగా 7 వికెట్ల తేడాతో మన భారత జట్టు విజయం సాధించింది. ఇందులో బంగ్లాదేశ్ 256 పరుగులు చేయగా… ఆ లక్ష్యాన్ని 41 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఇక ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా… రోహిత్ శర్మ మరియు గిల్ బాగా రాణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version