నేడు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఉదయం 8 గంటలలోపే పరీక్షా సెంటర్లకు హాజరయ్యారు. గ్రూప్-2 పరీక్షల కోసం ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ముందుగానే అభ్యర్థులకు మార్గదర్శకాలు సైతం పాస్ చేశారు.
ఈ క్రమంలోనే ఓ ఎగ్జామ్ సెంటర్ వద్ద అరుదైన దృశ్యం వెలుగు చూసింది. పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్కు నవ వధువు హాజరైంది.ఆదివారం ఉదయం వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి పెళ్లికూతురు నమిత వచ్చింది.గ్రూప్-2 పరీక్షలు రాయడానికి చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్కు నమిత వెళ్లడంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. చెకింగ్ స్వ్కాడ్ కూడా పెళ్లికూతురుని అలానే చూస్తుండిపోయారు. కాగా, నమితకు తోటి అభ్యర్థులు బెస్ట్ విషెస్ చెప్పారు.
పెళ్లి బట్టల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్ కు నవ వధువు
ఈరోజు వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిన నమిత
గ్రూప్-2 పరీక్షలు రాయడానికి చిత్తూరులోని పెళ్లి మండపం నుంచి తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్ కు వెళ్లిన నమిత
నమితకు బెస్ట్ విషెస్ చెప్పిన తోటి… pic.twitter.com/P9KDDnMSdv
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025