ఆ మ‌హిళా ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స‌ర్‌ప్రైజ్‌..!

-

వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌లో త‌న‌దైన ముద్ర‌వేస్తున్నారు. అన్నివ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూనే.. వెన్నంటి ఉన్న పార్టీ శ్రేణుల‌ను కాపాడుకుంటున్నారు. ఇప్ప‌టికే అనేకుల‌కు స‌ముచిత ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో, ప్ర‌భుత్వంలో స‌ముచిత గౌర‌వం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళా ఎమ్మెల్యేకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంత‌కీ ఏమిటా స‌ర్‌ప్రైజ్ అని అనుకుంటున్నారా..?  ఇక సూటిగా ఆ విష‌యానికి వ‌చ్చేద్దాం.. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి పూనుకున్నారు.

ఈ సందర్భంగా ఓ మ‌హిళా ఎమ్మెల్యేకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమెకు భర్తకు కీలకమైన పదవి క‌ట్ట‌బెట్టారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ- పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ / సీఈవోగా రాయలసీమ ప్రాంతానికి చెందిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త అయిన ఆలూరు సాంబశివారెడ్డిని నియ‌మించారు.  ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ మ‌హిళా ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స‌ర్‌ప్రైజ్‌..!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి ఆమె భర్త సాంబ‌శివారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి మరీ జగన్ కు కృతజ్ఞతలు తెలుప‌డం గ‌మ‌నార్హం.  సెల్ఫీ దిగి జగన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆయ‌న‌. తనకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ త‌న‌పై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని ఆయ‌న అన్నారు.

ఆ మ‌హిళా ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స‌ర్‌ప్రైజ్‌..!

జగన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపేందుకు తాను వచ్చానని ఆయ‌న‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా యజ్ఞం చేస్తోందని.. దాన్ని తాను అందరి సహకారంతో పూర్తి చేస్తానని సాంబశివారెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల్లో కూడా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌ముచిత నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version