ఆన్‌లైన్‌లో లడ్డూలు బుకింగ్ అవాస్తవం.. భక్తులు ఎవరూ నమ్మొద్దు : TTD

-

ఆన్‌లైన్‌లో లడ్డూలు బుకింగ్ అవాస్తవం.. భక్తులు ఎవరూ నమ్మొద్దు అని TTD పాలక మండలి అధికారికంగా ప్రకటించింది. టీటీడీ వెబ్సైట్ ద్వారా శ్రీవారి లడ్డూలను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

దర్శనంతో సంబంధం లేకుండా లడ్డులు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భక్తులు ఎప్పటి లాగే, లడ్డూలను కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది TTD పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version